Nov 04,2023 00:08
అర్జీలు స్వీకరిస్తున్న జెసి శ్రీనివాసులు

ప్రజాశకి-కొనకనమిట్ల: స్థానిక ఎస్సీ వసతి గృహంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 189 అర్జీలు వచ్చాయి. ఎక్కువగా భూ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తుండడంతో బర్రెలు మేపుకునేందుకు ఇబ్బందిగా మారిందని పలు గ్రామాల ప్రజలు విన్నవించారు. కరువు మండలంగా కొనకనమిట్ల మండలాన్ని ప్రకటించాలని ఎంపీపీ మురళీకృష్ణ, జడ్పిటిసి ఏడుకొండలు, మాజీ ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి జేసీకి అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జీవీ నారాయణరెడ్డి, డిఆర్‌డిఏ టి రవికుమార్‌, డ్వామా పిడి శీనారెడ్డి, పలువురు జిల్లా అధికారులు, తహశీల్దారు షాజిదా, ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి పాల్గొన్నారు.