
ప్రతిభ చాటిన 'ద్రావిడ' విద్యార్థులు
ప్రజాశక్తి- గుడిపల్లి: తిరుపతి నగరంలోని ఎన్సిసి నగర్లో సిఏటిసి క్యాంపులో స్థానిక ద్రావిడ విశ్వవిద్యాలయం ఎన్సిసి విభాగం సిటిఓ డాక్టర్ శ్రీప్రియ ఆధ్వర్యంలో 16 మంది ఎన్సిసి క్యాడెట్లు పది రోజులు క్యాంపులో పాల్గొన్నారు. వీరు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఏకె. వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ఈ క్యాంపులో పైరింగ్లో విద్యార్థిని నీరజ మెడల్ సాధించగా, మధుతేజకి గార్డ్ ఆఫ్ హానర్ లభించిందని, గిరి నాయక్ వాలీబాల్లో మెడల్ సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా క్యాంపులో పాల్గొన్న క్యాడెట్లు అందరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నట్లు తెలిపారు. గురువారం వర్సిటీకి విచ్చేసిన క్యాడెట్లను వైస్ ఛాన్సలర్ ఆచార్య తుమ్మల రామకష్ణ, రెక్టార్ ఆచార్య అనురాధ, రిజిస్ట్రార్ అభినందించారు. వర్సిటీ ఎన్సిసి విభాగం ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపుల్లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.