
ప్రజాశక్తి-కనిగిరి: ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా నాయకులు జి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనంలో ముఖ్య కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన శాస్త్రీయ ఆలోచన క్లాసును బోధించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం వలన వరి, మినుము, కంది, పొగాకు, మిరప పొలాలు నెర్రెలిస్తున్నాయని, రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని కోరారు. ప్రతి ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, తదుపరి 2వ క్లాసు సిపిఎం జిల్లా నాయకులు రఘురాం సమాజ పరిణామం క్లాసును బోధించారు. ఈ సందర్భంగా సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి కేశవరావు మాట్లాడుతూ కనిగిరి పట్టణంలో అన్ని వార్డులలో కొత్త బోర్లు వేసి వాడుక నీరు ఇవ్వాలని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏడుకొండలు, శాంతికుమారి, ప్రసన్న, వెంకటమ్మ, నరేంద్ర, పిచ్చయ్య, చెన్నకేశవులు, ఎలీషమ్మ తదితరులు పాల్గొన్నారు.