
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: చీకటిని తరిమికొట్టి వెలుగులను నింపేదీపావళి పండుగ ప్రజలందరి జీవితాలలో సరికొత్తకాంతులు నింపాలని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు డిప్యూటి సిఎం నాయణస్వామి, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉషశ్రీ చరణ్, మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపిలు మిథున్రెడ్డి, ఎన్.రెడ్డప్ప, జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సంస్కృతికి ప్రతిబింభంగా పండుగలు నిలుస్తాయన్నారు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల ,మత, వర్గ విభేదాలను విస్మరించి ప్రజలు సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తులే శోభావళి.. విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని, ఈ దీపావళి అందరి జీవితాలలో అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు సరికొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు.
జర్నలిస్టులకు నూతన వస్త్రాలు, టపాకాయల పంపిణి
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: దీపావళి పండగను పురస్కరించుకొని చిత్తూరు జర్నలిస్టులకు మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ శనివారం తన కార్యాలయంలో నూతన వస్త్రాలు, టపాయలు పంపిణీ చేశారు. జర్నలిస్టుల కోసం ప్రతి ఏటా నూతన వస్త్రాలు, టపాయాలు పంపిణీ చేస్తున్న బుల్లెట్ సురేష్కు చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు లోకనాధం, అశోక్కుమార్లు కృతజ్ఞతలు తెలిపారు.