Nov 09,2023 21:38

ప్రజల వద్దకే న్యాయవ్యవస్థ
డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కరుణకుమార్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

గతంలో న్యాయం కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగేవారని ఇప్పుడు న్యాయవ్యవస్థ ప్రజల వద్దకు వెళ్లి న్యాయసేవలు అందిస్తుందని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని జిల్లా జైల్‌, ఆర్టీసీ 1 డిపో, ప్రభుత్వ ఐటిఐలో నిర్వహించిన జాతీయ న్యాయసేవా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో న్యాయం కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగేవారని ఇప్పుడు న్యాయ వ్యవస్తే ప్రజల వద్దకు వెళ్లి వారికి న్యాయసేవలు అందిస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవా అధికార సంస్థ, హైకోర్టు ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 13 మండల న్యాయసేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు సత్వర సమన్యాయం ఉచితంగా అందించాలన్నదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నేడు ఇక్కడ న్యాయసేవ దినోత్సవం జరుపుకోవడం, న్యాయవ్యవస్థ ఎంతో ప్రతిష్టంగా గ్రామగ్రామాలలోని ప్రజలతో మమేకమై ప్రజల కోసం ప్రజల సమస్యలను పరిష్కరించుటకు పటిష్టంగా పనిచేస్తున్నారు.
నగరపాలక కార్యాలయంలో న్యాయ సేవలు, సదస్సుల నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో చిన్నయ్య, కమిషనర్‌ జె అరుణ, సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఏఎస్వో సౌందర్‌ రాజన్‌, సీఎంఎం గోపి, బిఎల్వోలు పాల్గొన్నారు. అనంతరం సబ్‌లో నిర్వహించిన సమావేశంలో, ఆర్టీసీ 1 డిపోలో నిర్వహించిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. అలాగే ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో విద్యార్థులు న్యాయసేవల గురించి అవగాహన కల్పించారు. జైల్‌ పర్యవేక్షకులు యం.వేణుగోపాల్‌ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్‌ కష్ణ మూర్తి, ఐటిఐ ప్రిన్సిపాల్‌ రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.