
ప్రజాశక్తి-కపిలేశ్వరపురం
ప్రజా సంక్షేమమే వైసిసి ప్రభుత్వ లక్ష్యమని ఎంఎల్సి తోట త్రిమూర్తులు అన్నారు. వెదురుమూడి గ్రామంలో ఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ.40లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చోడే రామ తులసి అధ్యక్షతన జరిగిన సభలో జెడ్పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. సూర్యనారాయణ మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థ ద్వారా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసిన ఘనత సిఎం జగన్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్బికె సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, వైసిపి నాయకులు రెడ్డి రాధా కష్ణ, వైస్ ఎంపిపి గుణ్ణం భాను ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ చుండ్రు అచ్యుత రామారావు,నక్క సింహాచలం, ఎంపిడిఒ రామ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.