Nov 05,2023 00:57
మాట్లాడుతున్న సీపీఎం మండల కార్యదర్శి ఉసా వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-సిఎస్‌పురం: ఈ నెల 15వ తేదీ విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు కోరారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్‌ తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యలు గాలికొదిలేసి వ్యక్తిగత దూషణలు, ఉన్మాద చర్యలు, ఓటు రాజకీయం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి ప్రజల ముందుకు వస్తున్న సిపిఎం పార్టీని ఆదరించాలని కోరారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే ప్రజల బతుకులు బాగుపడతాయని అన్నారు. ఈ విధానాల అమలు కోసం చేసే పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. గ్రామగ్రామాన సిపిఎం కార్యకర్తలు తిరిగి ఈ విధానాలు ప్రచారం చేస్తున్నారని, ఈ నెల 15న విజయవాడలో జరిగే బహిరంగసభతో ప్రజల అజెండా ముందుకు వచ్చే విధంగా ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ప్రజా ప్రణాళిక తయారుచేసి ప్రజల ముందుకు సిపిఎం వస్తోందని, ఈ ప్రణాళిక అమలు జరిగితే అన్ని తరగతుల ప్రజలు అభివృద్ధి చెందుతారని, సుఖంగా జీవిస్తారని, అందుకోసం ఈ ప్రజా ప్రణాళికను ప్రతి ఒక్కరూ చదివి ఆలోచించి పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బక్క ఏసురత్నం, మారంరెడ్డి రత్నారెడ్డి, ఎస్‌కే అజీద్‌ బాషా, అంకేపల్లి వెంకటేశ్వర్లు, బక్క జేసురత్నం తదితరులు పాల్గొన్నారు.