
ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్ : పొగాకు రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకు పండించాలని లక్ష్యంగా నిర్ణయిం చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలతో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పొగాకు రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలను రైతు సంఘాల నేతలు బోర్డు చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది పొగాకు రైతులకు అధిక లాభాలు వచ్చినట్లు తెలిపారు. లోయర్ గ్రేడ్ పొగాకుకు సైతం మంచి ధరలు పలికాయన్నారు. రానున్న రెండేళ్లు పొగాకు దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు. కరోనా నేపనథ్యంలో ఇతర దేశాలలో పొగాకు సాగు తగ్గటంతో ఎగుమతులు పెరిగాయన్నారు. గత ఏడాది రూ.950 కోట్ల విదేశీమారక ద్రవ్యం బోర్డుకు సమకూరిందన్నారు. ఈ ఏడాది 1200 - 1400 కోట్లు విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. పొగాకు రైతులను ఆదుకోవటానికి బోర్డు ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. పొగాకు వేలంలో ప్రముఖ కంపెనీలు పాల్గొనేలా చర్యలు తీసు కుంటామన్నారు. రైతులు పండించిన పొగాకుకు మంచి ధరలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. హయ్యర్ గ్రేడ్తో పాటు లోయర్ గ్రేడ్ పొగాకు కూడా సరైన ధరలు లభించేలా చూస్తామన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో రైతులు పండించే పొగాకుకు మార్కెటింగ్లో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పరిమితికి మించి పండించిన పంటకు పొగాకుకు అపరాధ రుసుం విధించే విషయాన్ని ఆలోచి స్తామన్నారు. పొగాకు పండించే రైతులకు సాంకేతిక పరమైన సలహాలు, సూచనలు అందిచేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు. సిబ్బంది భర్తీ విషయమై బోర్డులో చర్చిస్తామన్నారు. ఔట్సోర్సింగ్ ద్వారా ఖాళీగా పోస్టులను భర్తీ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నా మన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కొన్ని పంటలకు పరిహారం ఇస్తున్నారని తెలిపారు. అందులో పొగాకు పంటను చేర్చే విషయమై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. వాతావరణ ఆధారిత బీమా పొగాకు పంటకు వర్తించేలా చర్యలు తీస ుకుంటామన్నారు. రానున్న కాలంలో పొగాకు రైతుల సంక్షేమం కోసం బోర్డు పని చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి, బోడపాటి బ్రహ్మయ్య, పి. ప్రసాద్, పమ్మి భద్రిరెడ్డి, కలిగిరి శ్రీకాంత్, భాస్కర్, కె.వెంకటేశ్వర్లు, వడ్డెళ్ళ ప్రసాద్, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.