Nov 15,2023 22:12

పంటలపై ఏనుగుల దాడి
ప్రజాశక్తి- సోమల:
సోమల మండలం నెరుకూరివారిపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాలపై ఆరు ఏనుగులు మంగళవారం రాత్రి టమోటా, మామిడి, వరి పంటలపై దాడిచేసి తీవ్రంగా నష్టపరిచినట్టు రైతులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి గ్రామ సమీపంలో తిరుగాడిన ఏనుగుల మంద ఆ తరువాత పలువురు రైతులకు చెందిన పంట పొలాలపై దాడిచేసి వరి పైరు తొక్కి వేయడంతోపాటు బిందు సేద్యం పైపులు, పరికరాలు ధ్వంసం చేసి రైతులకు నష్టం కలిగించాయి. సోమవారం రాత్రి ఆవులపల్లె మధురమలై కొండ ప్రాంతంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు తిన్నగా నెరుకూరువారిపల్లి చేరుకుని పంటలను నష్టపరిచినట్టు రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేశామని, ఏనుగుల భారీ నుండి తమను పంటలను కాపాడాలని రైతులు కోరారు.