
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
కార్మిక చట్టాల ప్రకారం తమకు రావాల్సిన వేతన బకాయిల కోసం సహకార విజయ డెయిరీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 60వ రోజుకు చేరుకుంది. వేతన బకాయిల కోసం కార్మికులు దీక్షలు చేస్తున్నా వారి కుటుంబాల ఆకలికేకలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన వేతన బకాయిల కోసం దీపావళి పండుగ రోజున కూడా తమ దీక్షలను కొనసాగిస్తామని కార్మిక సంఘం నేతలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ వేతన బకాయిలు చెల్లించాలని కోరారు.