
ముసునూరు : సిఎం జగన్మోహాన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరిని ఆదుకుంటున్నారని జెడ్పిటిసి డాక్టర్ ప్రతాప్, ఎంపిపి కోటగిరి రాజానాయనలు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రమణక్కపేట గ్రామ సచివాలయం నందు పల్లెకు-పోదాం కార్యక్రమంలో భాగంగా సంక్షేమపథకాల బోర్డును ఆవిష్కరించారు. సర్పంచి రంగు ధనలక్ష్మి గాంధీ, ఎంపిటిసి కోండా దుర్గాభవానీల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి జగన్ సిఎం అయితే మరెన్నో పథకాలు ప్రవేశపెడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి పాముల గంగథరరావు సర్పంచులు పేరం కృష్ణ, వైసిపి నాయకులు కంభాల రాంబాబు, ఎఒ కూచిపూడి సాయిరామ్, పంచాయతీ కార్యదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరరావు, ప్రసాద్ పాల్గొన్నారు.
ముదినేపల్లి :మండలంలోని వడాలిలో గురువారం నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే' కార్యక్రమానికి ఎంఎల్ఎ దూలం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు ఎంఎల్సి జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.