
ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష(జెఎఎస్) కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశిబిరాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు.
అమలాపురం అల్లవరం మండల పరిధిలోని గోడి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫుడ్స్ 'స్టాల్స్ పరిశీలించి పదార్థాలను ఆరగించి రుచి చూశారు. కార్యక్రమంలో ఎంఎల్సి బొమ్మి ఇజ్రాయిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ దంగేటి డోలామణి రుద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు శేషారావు, కె.గౌతమి, బాపూజీ మండల స్థాయి అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు. మామిడికుదురు ఆదుర్రుల్లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని అక్కడ ఉన్న హైస్కూల్లో ఏర్పాటుచేశారు.ఎంఎల్ఎ కొండేటి చిట్టిబాబు వైద్య శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. పరిపాలనాధికారి కారుపల్లి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి బివివి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచ్ వాసంశెట్టి రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం అంగన్వాడీల ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి గ్రామ అధ్యక్షుడు నాగిరెడ్డి రాంబాబు, జెడ్పిటిసి సభ్యురాలు కురుపూడి భవాని, గ్రామ వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం వడ్లమూరు ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ చుండ్రు మంగాయమ్మ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, జెడ్పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా జరిగిన వైద్య శిబిరంలో పలువురు వైద్య నిపుణులు రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యుడు పలివెల మధు, మేడిశెట్టి దుర్గారావు, ఎంపిడిఒ ఎం.రామకృష్ణారెడ్డి, తహశీల్దార్ కె.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్ సాకుర్రు లో గ్రామ సర్పంచ్ గుత్తుల చిరంజీవి రావు అధ్యక్షతన శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని అమలాపురం ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి, వైస్ ఎంపిపి పాలమూరి బాలకష్ణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం వెలంపాలెం గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి అంబటి భవాని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తనయుడు నరేన్, గ్రామ సర్పంచ్ టేకుమూడి సుజాత, ఎంపిటిసి సభ్యురాలు తుమ్మూరి సుబ్బలక్ష్మి, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.