
ప్రజాశక్తి- వెదురుకుప్పం : పెనుమూరు మండలంలోని రామకష్ణాపురం ఎంపీటీసీ సభ్యురాలు, వైస్ ఎంపీపీ -2 దూది అరుణ గత నెల 28వ తేదీ గుండె పోటుతో మతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెనుమూరు వైసిపి-2కు నోటిఫికేషన్ విడుదల చేసి గురువారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టింది. గుంటిపల్లి గెస్ట్హౌస్లో గురువారం ఉదయం 9 మంది ఎంపీటీసీలు జ్ఞానేంద్రరెడ్డితో సమావేశమయ్యారు. కలవగుంట ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతిని పెనుమూరు వైస్ ఎంపీపీ-2గా మహాసముద్రం దయాసాగర్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి సుబ్రమణ్యం ఎన్నిక నిర్వహించగా పెనుమూరు ఎంపీటీసీ సభ్యురాలు జి.సుభాషిని కలవకుంట ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతిని పెనుమూరు-2గా ప్రతిపాదించారు. ప్రస్తుతం మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా 9 మంది సభ్యులు జ్యోతిని బలపరిచారు. దీంతో పెనుమూరు వైస్ ఎంపీపీ -2గా జ్యోతి ఎన్నిక లాంఛనమైంది. ఎంపీపీ మహాసముద్రం హేమలత సురేష్ రెడ్డి, వైసిపి నాయకులు మహాసముద్రం సురేష్ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు జి.దొరస్వామి యాదవ్, సింగల్ విండో అధ్యక్షులు కారేటి గోవిందరెడ్డి, వైస్ ఎంపీపీ కోదండన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి కంచర్ల చక్రవర్తి నాయుడు, మండల ఉపాధ్యక్షులు దూది శంకర్, ఎంపిటిసిలు శివలింగం, సుబ్రహ్మణ్యం, ఫళణి, వాణిశ్రీ, కుసుమ కుమారి, తదితరులు పాల్గొన్నారు.