Oct 27,2023 16:15

ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని జొన్నాడలో  గ్రామ రైతు భరోసా కేంద్రం నందు  సర్పంచ్ కట్టా శ్రీనివాస్ అధ్యక్షతన ముందుగా గ్రామ సభ నిర్వహించి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని   ప్రభుత్వ విప్, శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం  లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఆయన ధాన్యం సేకరణ, తేమ శాతం, అనాలిసిస్  విధానాన్ని  సిబ్బందిని అడుగగా  ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించవచ్చన్నారు. హమాలీ, రవాణా ఖర్చులు నేరుగా రైతులకు వేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలులో ఏ విధమైన ఇబ్బందులు ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1967  ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డి.ఎం.ఎస్ సుధా సాగర్  మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కి ఉపయోగించే వాహనాలు తప్పని సరిగా జి.పి.ఎస్ ఫిట్ చేయించుకోవాలన్నారు. జి.పి.ఎస్ ఫిట్ ఉన్న వాహనాలు పిపిసి పోర్టల్లో ఎంటర్ చేయించుకోవాలన్నారు. అనంతరం వారంతా పిపిసి కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా  సివిల్ సప్లై అధికారి ఏఎం జనరల్ నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం.ముక్కంటి, ఎడిఏ కాకి నాగేశ్వరరావు, తహశీల్దార్ ఐ.పి.శెట్టి, ఏవో ఎస్.లక్ష్మిలావణ్య,   సొసైటీ అధ్యక్షులు తాడి  మెహర్ ఆదిత్యరెడ్డి, ఉప సర్పంచ్  నాగమోహన్ రెడ్డి, ఎంపిటిసి  మారిశెట్టి శ్రీను, వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, ఎఎంసి చైర్మన్ యనమదల నాగేశ్వరరావు,  వైసిపి నేతలు ద్వారంపూడి దొరబాబు, సొసైటీ సిఈఓ రత్నాజీ, విఎఎలు సుమ, నరేష్, రైతులు  పాల్గొన్నారు.