Nov 17,2023 18:21

ప్రజాశక్తి - మండవల్లి
            విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఎంఇఒ డి.రామారావు తెలిపారు. మండలంలోని ఇంగిలంపాకలంక, నందిగామలంక పాఠశాలలను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించి విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సౌకర్యాలను సదుపాయాలను విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేవిధంగా చూడాలన్నారు. ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజన పథకం, జగనన్న విద్యాకానుక కిట్లు అందరికీ వచ్చాయా లేదో అనేది విద్యార్థులను అడిగి తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు రోజూ హాజరయ్యేలా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌పి అప్పారావు, నందిగామ లంక, ఇంగిలిపాకలంక ప్రధానోపాధ్యాయులు నాగాంజనేయులు, రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.