
ప్రజాశక్తి-టంగుటూరు
పారదర్శకమైన ఓటరు జాబితా రూప కల్పనే లక్ష్యంగా పనిచేయాలని తహశీల్దార్ కొల్లిబోయిన సంజీవరావు బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక 1వ సచివాలయంలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన సమయంలోగా ఓటరు జాబితా సవరణలను పూర్తి చేసి సమగ్రమైన ఓటరు జాబితాలను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా నూతనంగా దరఖాస్తు చేసే ఓటర్లతో పాటు ఓటరు జాబితా సక్రమంగా ఉండాలంటే సంబంధిత బూత్ లెవెల్ ఏజెంట్లు సహకారంతో సమగ్రమైన ఓటరు జాబితాలను రూపొందించాలని తహశీల్దార్ సంజీవరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ నర్రా జగదీష్ బాబు, ఉప తహశీల్దార్ జె శ్రీనాథ్, ఓ శ్రీవాణి, బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు,