
ప్రజాశక్తి-దర్శి: ఇటీవల నియోజకవర్గంలో ఓటర్ల జాబితా విడుదలైందని, ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని చేర్పించాలని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు నాదెళ్ల బ్రహ్మం అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ దర్శి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ప్రభుత్వ నిబంధనల మేరకు చేర్పులు, తొలగింపుల్లో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. గ్రామాల్లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబానికీ వివరించాలని కోరారు. జగన్ మోహన్రెడ్డి పాలనలో అసమానతలు, అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, సమన్వయ కమిటీ సభ్యులు చిట్టే వెంకటేశ్వర్లు, పిడతల నెమిలయ్య, యాదగిరి వాసు, కూరపాటి శ్రీను, ఓబుల్రెడ్డి, క్లష్టర్, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.