
ప్రజాశక్తి-అమలాపురం
గురువారం స్థానిక కలెక్టరేట్లోని డిఆర్ఒ ఛాంబర్ నందు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతి నిధులతో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు సమావేశమై ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియ పురోగతిని విశదీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ నెల 27వ తేదీ సాయం త్రం ముసాయిదా ఓటరు జాబితా రాజకీయ పార్టీలకు సమర్పిస్తామన్నారు. ఈనెల 27వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందని, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహించి ఓటింగ్ శాతాన్ని పెంపొందించే దిశగా కూడా చర్యలు చేపడతామన్నారు. ఆ యొక్క తేదీలను ఎన్నికల సంఘం నిర్ణయిం చడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 26న క్లెయిమ్స్ అభ్యంతరాలు పరిష్కరిస్తామన్నారు. 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురితమవు తుందన్నారు. ఫారం 7 ఒక వ్యక్తి ఐదు దరఖాస్తులు మించి తీసుకుని రాకూడదని స్పష్టం చేశారు. కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా తయారీకై, పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిం చేందుకు ఈనెల 27 నుంచి డిసెం బర్ 9వ తేదీ వరకు రాజకీయ పార్టీలు వారు పోలింగ్ కేంద్రాల వారిగా బూతులు ఏజెంట్లను నియమించాలని ఆయన సూచించారు. జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రాథమిక స్థాయికి ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల నందు కొనసాగుతోందని ఈ ప్రక్రియ నవంబర్ 10వ తేదీ వరకు ఉంటుం దన్నారు. ముసాయిదా జాబితాలో లోపాలు గుర్తించినట్లయితే రాజ కీయ పార్టీల ప్రతినిధులు సంబం ధిత అధికారుల దష్టికి తీసుకు రావాలని సూచించారు. జిల్లాకు సరిపడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సమకూర్చడం జరి గిందన్నారు. కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి జి.కేశవర్ధనరెడ్డి, టిడిపి తరఫున అల్లాడి స్వామి నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున కుడిపూడి శ్రీను, బిజెపి తరఫున డి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.