Oct 23,2023 11:01

ప్రజాశక్తి-మండపేట : ఈ నెల్ 29 న గుంటూరులో నిర్వహించే రాష్ట్ర నూర్ బాష్ సింహ గర్జనకు తరలిరావాలని జిల్లా నూర్ బాష్ సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రాహిం పిలుపునిచ్చారు. మండపేటలో సోమవారం మాట్లాడుతూ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పర్యటించి పోస్టర్ ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో పలువురు సంఘం నాయకులు, పెద్దలను కలిసి ఆహ్వానించినట్లు చెప్పారు. కొత్తపేట, పలివేల,గంటి, ముంగండ,బండారు లంక, పోతావరం, రాజోలు, శివకోడు, మనేపల్లి, తాటి పాక, నగరం, అల్లవరం, గూడాల, అమలాపురం, ముమ్మిడివరం,చెయ్యరు, అయినాపురం, కొత్తలంక, అంబాజీ పేట, కాట్రేనికోట తదితర ప్రాంతాల్లో పర్యటించి గర్జన విజయవంతం కరపత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.