
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
చారిత్రాత్మకమైన ఢిల్లీ రైతాంగ పోరాటానికి వ్యతిరేకంగా న్యూస్ క్లిక్ ఎఫ్ఐఆర్లో నిరాధారమైన, నిజాయితీ లేని తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ, బిజెపి ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ, ఎపి రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం న్యూస్ క్లిక్ ఎఫ్ఐఆర్ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బికెఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడారు. న్యూస్ క్లిక్ ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం ఢిల్లీ రైతు ఉద్యమంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి విదేశీ నిధులు వచ్చాయని చెప్పడం దారుణమన్నారు. ఢిల్లీ ఉద్యమం సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. వెయ్యి రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.జగన్నాథం, వి.సాయిబాబు, పి.కిషోర్, మావూరి శ్రీనివాస్, శ్యామలారాణి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు దండుబోయిన చంద్రశేఖర్, గౌడు రంగబాబు, ఎఐటియుసి జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, కడుపు కన్నయ్య, బికెఎంయు నాయకులు పొట్టేలు పెంటయ్య, బుగ్గల ప్రభాకర్ పాల్గొన్నారు.
పోలవరం : స్థానిక బస్టాండ్ సెంటర్లో ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన న్యూస్ క్లిక్ ఎఫ్ఐఆర్ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం నాయకులు బోరగం భూ చందర్రావు, జి.వెంకట్రావు, మడివి చలపతిరావు, సముద్రాల సాయికృష్ణ, మిడియం గంగాదేవి పాల్గొన్నారు.
చింతలపూడి : స్థానిక బోసుబొమ్మ సెంటర్లో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎఫ్ఐఆర్ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు సినియర్ నాయకులు సూర్యకుమార్, ఎఐటియుసి ఏరియా అధ్యక్షులు తొర్లపాటి బాబు, ఎఐకెఎస్ జిల్లా అధ్యక్షులు డి.రంగనాథ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు కె.వీరబాబు, రమేష్, అప్పారావు, ప్రసాద్, సిఐటియు నాయకులు నత్త వెంకటేశ్వరావు, బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సత్యనారాయణ, జనవిజ్ఞాన వేదిక నాయకులు పి.పాండురంగారావు పాల్గొన్నారు.