Nov 03,2023 23:29

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
నగరపాలక సంస్థ పరిధిలో జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో నిర్మాణంలో ఉన్న గహాలను డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తి చేయించాలని కమిషనర్‌ డా. జె అరుణ సంబంధింత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కమిషనర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని అనుప్పల్లి లేఅవుట్‌ సందర్శించారు. లేఔట్‌ లో ఖాళీ ఇంటి స్థలాలను పరిశీలించారు. ఇంటి స్థలాలు పొందిన వారంతా ఇల్లు నిర్మాణాలు ప్రారంభించేలా సంబంధిత లబ్ధిదారులను కలిసి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం హౌసింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, వార్డు అమినిటీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అన్ని లేఅవుట్ల పరిధిలో ప్రస్తుతం బీఎల్‌, ఆర్‌ఎల్‌, ఆర్సీ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. అధికారుల వారీగా రోజువారి, వారాంతపు లక్ష్యాలను నిర్దేశించుకుని ఆమేరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌, నోడల్‌ అధికారి నరసింహ, వార్డు అమినిటీ కార్యదర్శులు పాల్గొన్నారు.
స్థానిక దుర్గమ్మ ఆలయం వద్దనున్న వనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్‌ డా. జె అరుణ ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కమిషనర్‌ గిరింపేట దుర్గమ్మ ఆలయం వద్దనున్న వనాన్ని పరిశీలించారు. వనంలో పిచ్చి మొక్కలను సత్వరం తొలగించాలని, సుందరంగా తీర్చిదిద్దే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డా లోకేష్‌, సెంటర్‌ ఇన్స్పెక్టర్‌ లోకనాథం పాల్గొన్నారు.