Nov 08,2023 18:01

ప్రజాశక్తి - టి.నరసాపురం
   దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు షాపులు నిర్వహించే యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని జీలుగుమిల్లి సిఐ బి.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో మందుగుండు సామాగ్రి దుకాణాలు ఏర్పాటు చేసే స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాదారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ బి.సురేంద్ర కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.