
నగరిలో మంత్రి రోజా చేసిన
అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
తిట్లపురాణంలో వైసీపీ మంత్రులకు ఆస్కార్ అవార్డులు
భానుప్రకాష్ సెటైర్లు
ప్రజాశక్తి- నగరి: నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా చేసిన అభివృద్ధి శూన్యం అని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం నగరి మున్సిపాలిటీ ఓం శక్తి గుడి ఆలయం నుంచి ర్యాలీగా జాతీయ రహదారిపై ఉన్న ఉయ్యాలకాల్వలో పారుతున్న రంగు నీరు లింగీసుగుంటలో రంగు నీరును ఈటీవీ ప్లాంటును సందర్శించారు. అనంతరం ఆయన నగరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజక వర్గంలో మంత్రి ఆర్కే రోజా చేసిన అభివద్ధి శూన్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార వైసీపీ అవినీతి, అక్రమాల గిరించి మాట్లాడితే తిట్లపురాణంతో విరుచుకుపడే నైజం వైసీపీ మంత్రులదని సెటైర్లు వేశారు. బూతులు తిట్టడంలో మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, రాజ్యసభ విజయ సాయిరెడ్డిలకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలన్నారు. నియోజక వర్గంలో సాగు, తాగు నీటి సమస్యలు పరిష్కరించడంలో మంత్రి రోజా తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. చెరకు రైతులకు బిల్లులు కూడా ఇప్పించడంలో చొరవ తీసుకోలేదన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం, భూములు స్వాహాచేయడంలో వైసీపీ నాయకులు సిద్దహస్తులన్నారు. మరమగ్గ కార్మీకులకు విద్యుత్ బిల్లులు రాయితీ కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇకనైనా వైసీపీ మంత్రులు అభివద్ధిపై దష్టి సారించాలని హితవు పలికారు. జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలకం ఈశ్వర్ ప్రసాద్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి పుష్పలత, రాష్ట్ర కమిటీ సభ్యులు వేళాయుధం, తదితరులు పాల్గొన్నారు.