Nov 14,2023 21:20

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   వ్యాపారులు, వర్తక సంస్థల ప్రతినిధులు టిడిఎస్‌పై అవగాహన పొందాలని చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ బుధవారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో వ్యాపారులకు టిడిఎస్‌పై అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి ఎన్‌.శ్రీనివాసరావు ఈ సదస్సుకు హాజరై టిడిఎస్‌పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సదస్సుకు వ్యాపారులు, వర్తక సంస్థల ప్రతినిధులు హాజరై అవగాహన పొందాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.