Nov 08,2023 23:14

నాలుగేళ్లలలో 40 ఏళ్ల అభివృద్ధి ప్రతి గ్రామానికి శ్మశాన వాటికల ఏర్పాటు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి

నాలుగేళ్లలలో 40 ఏళ్ల అభివృద్ధి
ప్రతి గ్రామానికి శ్మశాన వాటికల ఏర్పాటు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ప్రజాశక్తి - కార్వేటినగరం : నాలుగు ఏళ్లలలో నలభై ఏండ్ల అభివద్ధి చేపట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని డిప్యూటీ సీఎం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 40 సంవత్సరాలు అధికారంలో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్రెడ్డి కుల, మత, ప్రాంతీయ విబేధాలు లేకుండా రాష్ట్రాన్ని అన్నివిధాల అభివద్ధి చేస్తుంటే ప్రతిపక్షం కోర్టుల ద్వారా స్టేలు వేసి అభివద్ధిని అడ్డుకుంటూ పైచాచికానందం పొందుతున్నారని విమర్శించారు. ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివద్ధి చెందాలనే తపన జగనన్న పోరాటం చేస్తుంటే, జీర్ణించుకో లేని టీడీపీ నాయకులు ఆటంకాలు కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామానికి స్మశాన వాటికలు ఏర్పాటు చేయడానికి రెవెన్యూ అధికారులు ముందుకు రావాలని ఆదేశించారు. అధికారులు రాజకీయ ఒత్తుళ్లకు లోనౌవకుండా ప్రజలకు సత్వర న్యాయం చేయాలన్నారు. పేదవారి కోసమే సీఎం జగనన్న విద్యకు పెద్దపీఠ వేశారని గుర్తు చేశారు. రానున్న భూపంపిణీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి రెండు విడతలుగా భూపంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు నియోజకవర్గంలో ఏదో మండలాన్ని ఆకస్మికంగా పర్యవేక్షించి సమస్యల పరిష్కారంపై ఆరా తీయాలని, సమస్యలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల అభివద్ధికి కార్యదర్శులు మూల స్థంభాలని మంత్రి కొనియాడారు. ఎన్ని నిర్భందనలు చేసినా రెవెన్యూ శాఖలో ఏలాంటి మార్పులు లేవని, దీనిపై ప్రత్యేక దష్టి సారించాలని జేసీ శ్రీనివాసులును ఆదేశించారు. కార్వేటినగరం సర్పంచ్‌ ధనంజయవర్మ, ఎంపీపీ లత కోర్కెల మేరకు టీటీడీ వారి దష్టికి తీసుకెళ్లి స్కంధపుష్కరిణిలో నూతనంగా తెప్పలు ఏర్పాటుకు కషి చేస్తామనని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లత, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, మండల పార్టీ కన్వీనర్‌ శేఖర్‌ రాజు, మండల కోఆప్షన్మెంబర్‌ పట్నం ప్రభాకర్రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు లోకనాధరెడ్డి, సర్పంచ్‌ ధనంజయవర్మ, జేసీఎస్‌ కన్వీనర్‌ పురంధర్‌, శేషాద్రి పాల్గొన్నారు.