- అప్పుల నుండి విముక్తి చేయండి
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ క్లాప్ డ్రైవర్లు 4వ.రోజు పోరాటం సిఐటియు నగర నాయకులు కుమార్ అధ్యక్షతన పున్నమి గెస్ట్ హౌస్ వెనకాల క్లాప్ ఆటోలు నిలబడు స్థలం నుండి క్లాప్ డ్రైవర్ లందరూ సీతారామ నగర్, కొత్త బస్టాండ్ యూకాన్ షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీగా వచ్చి సుందరయ్య సర్కిల్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు, సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి మారెళ్ల రామాంజనేయులు (విజయ్),సిఐటియు మాట్లాడుతూ కష్టపడి పని చేస్తున్నటు వంటి క్లాప్ డ్రైవర్లకు 3 నెలల నుండి 9 నెలల వరకు ఇవ్వవలసి ఉండగా ఒక జీతం ఇచ్చి రెడ్డి ఏజెన్సీ వారు క్లాప్ డ్రైవర్ల అప్పుదారులను మేల్కొల్పారని తెలిపారు, పెండింగు జీతాలు పూర్తి ఇవ్వకుండా కార్మికుల కుటుంబాల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు,రెడ్డి ఏజెన్సీ వారు పెండింగ్ జీతాలు ఇవ్వక పోగా అలాగే ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం డ్రైవర్లకు ₹18,500/- ఈఎస్ఐ, పీఎఫ్,వీక్లీ ఆఫ్ లు, పని భద్రత కల్పించాలని ఉన్నవీటిని అమలు చేయకుండా 2 సంవత్సర కాలం నుండి క్లాప్ డ్రైవర్ల జీవితంలో కట్ చేస్తున్నారు, కానీ వారి అకౌంట్లో వేయడం లేదని తెలిపారు, కార్మికులకు వీక్లీ ఆఫ్ అగ్రిమెంటులో ఇవ్వాలని ,ఉన్న ప్రభుత్వ సంస్థల లోనే అమలు చేయక పోవడం బాధాకరమన్నారు, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వీటి కోసం ఉద్యమిస్తున్న కార్మికులపై రెడ్డి ఏజెన్సీ వారు పెండింగ్ జీతాలు అగ్రిమెంట్ అమలు చేయకపోగా పనిచేయాలని వేధిస్తున్నారు,మా కడుపులుకోట్టి వైసీపీ ప్రభుత్వ పెద్దలు వారు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పొట్టలు నింపుకుంటున్నారు,క్లాప్ ఆటో కార్మికులకు జీతాలు ఇప్పించకుండ వారి కుటుంబాలను ఉపవాసం ఉంచడం, వైసీపీ ప్రభుత్వానికి, మునిసిపల్ అధికారులకు మానవత్వం లేదని నిరూపించుకున్నారని వారు విమర్శించారు, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మున్సిపల్ కమీషనర్ జోక్యం చేసుకొని క్లాప్ డ్రైవర్స్ కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించి వారి కుటుంబాలు ఆకలి బాధతో అలమటించకుండా ఆదుకోవాలని లేదా ఈ నెల19 లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే 20 తేది నుండి క్లాప్ ఆటోలు బంద్ చేసి సమ్మె చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లాప్ డ్రైవర్ లందరూ పాల్గొన్నారు.










