
ప్రజాశక్తి-అర్ధవీడు
మండలంలోని కాకర్ల గ్రామంలో మిరప రైతులకు మంగళవారం శిక్షణ తరగతులు సందర్భంగా మండల ఉద్యాన శాఖ అధికారిని డి.శ్వేత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైరస్కు మందు లేదని, వాటి వ్యాప్తికి దోహదపడే రసం పీల్చే పురుగులను నిర్మూలించి వైరస్ను సమర్ధవంతంగా నిర్మూలించుకోవాలన్నారు. పొలంలో అక్కడక్కడ పసుపు, నీలం రంగు జిగురు అట్టలను పెట్టాలన్నారు. పేనుబంక నివారణకు ఇమిడా క్లోపిడ్ 0.25 మిల్లీలీటరు లేదా ఎసిపేటు 15 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు విప్రో నిల్ 0.3 శాతం గుళికలు నాటిన 15 రోజులకు, 45 రోజులకు ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలన్నారు.తెల్ల దోమలను నివారించుకోవడానికి ఐదు శాతం వేప కషాయం గానీ, ఎకరానికి 30 గ్రాముల ఎసిపేట్ 250 మిల్లీ లీటర్లు మందును మార్చి మార్చి రెండు నుంచి పది రోజుల వ్యవధిలో పిచికారి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రైతులు విఏఏ రమాదేవి పాల్గొన్నారు.