
ప్రజాశక్తి - చాట్రాయి
మిర్చి తోటలలో సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని, తెల్లదోమ, తామర పురుగు నివారణకు పసుపు, నీలిరంగు జిగురు అట్టలను తోటలలో ఏర్పాటు చేసుకోవాలని ఉద్యానశాఖ మండల అధికారిని ఆర్.హేమ తెలిపారు. మండలంలోని చాట్రాయి, నరసింహారావు పాలెం గ్రామాలలో మంగళవారం ఉద్యానశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో మిర్చి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా హేమ రైతులతో మాట్లాడుతూ తామర పురుగు, పెనుబంక ఉన్నట్లయితే ఇమిడా క్లోఫ్రెడ్ 0.5 మిల్లీ లీటర్కు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఊతపురుగు కనిపిస్తున్నందున వేప నూనె వెయ్యి మిల్లీ లీటర్లకు లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. రసాయన వాడకం తగిన మోతాదులో వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఆర్బికె సిబ్బంది పాల్గొన్నారు.