
ప్రజాశక్తి -చిత్తూరు
మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరు జిల్లా డి.ఆర్.డి.ఏ. అద్వర్యంలో యన్.ఐ.సి. సెంటరు నందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ '' కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఎఫ్ఎంఈ కింద ఒక లక్ష మంది మహిళలకు రూ. 380 కోట్లు మహిళా లబ్దిదారుల ఖాతాలకు విడుదల చేశారు. ఈ కార్యక్రమములో ఆంద్రప్రదేశ్ తరపున 12,450 మంది లబ్దిదారులకు రూ. 49.80 కోట్లు మహిళా లబ్దిదారుల ఖాతాలకు విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలో 2022-2023, 2023-2024 సంవత్సరము గాను 1,679 మందికి రూ. 6.71 కోట్లు మహిళా లబ్దిదారుల ఖాతాలకు విడుదల చేయడం జరిగినది. ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ వారి వారి రంగాలలో ప్రపంచములోనే అగ్రగామిగా ఉండాలని మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రపంచ దేశాలకు మన ఉత్పతులను పెద్ద మొత్తంలో ఎగుమతి చేయాలని అన్నారు. వర్చువల్ విధానంలో డిఆర్డిఎ పథక సంచాలకులు తులసి, చిత్తూరు, తిరుపతి డిపిఎంలు టి.మధుసూదన్, పి.నాగేశ్వర్రావు, ఆదినారాయణ, ఎపిఎంలు సాంబశివ, జ్యోతి పాల్గొన్నారు. .