
ప్రజాశక్తి - టి.నరసాపురం
మహిళల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ దోహదపడుతుందని మక్కినవారిగూడెం సొసైటీ చైర్పర్సన్ పిన్నమనేని చక్రవర్తి అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జగనన్న పాలవెల్లువ చెక్కులను గురువారం చక్రవర్తి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ ద్వారా మంజూరైన ఎనిమిది మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున రూ.2.40 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఇఒ యువివి.సత్యనారాయణ, గోపీ పాల్గొన్నారు.