
ఆగిరిపల్లి : ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడమే ధ్యేయంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని ఆగిరిపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి మేనేజర్ మిరియాల జగన్మోహానరావు తెలిపారు. శుక్రవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ వ్యవస్ధాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగిరిపల్లి యూనియన్ బ్యాంక్లో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ మేనేజర్ వివి.సోమరాజు, ఆర్డిఒ కె.అరవింద్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.