Nov 06,2023 21:00

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటించాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి సూచించారు. సోమవారం స్థానిక జెడ్‌పిహెచ్‌ బాలుర పాఠశాలను ఆమె సందర్శించారు. గ్రీన్‌ రైస్‌, ఉడికించిన కోడి గుడ్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పి.భవాని ప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు, వైసిపి పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, వైసిపి సీనియర్‌ నాయకులు బత్తిన చిన్నా పాల్గొన్నారు.