
ప్రజాశక్తి-యర్రగొండపాలెం
ఖాదీ మహోత్సవం వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండల స్థాయిలోని పలు పాఠశాలల్లో వ్యాసరచన, డిబేట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేసినట్లు ఎంఈవో ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గత వారంలో పాఠశాల స్థాయిలో జరిగిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి మండల స్థాయిలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అంతరంచి పోతున్న ఖాదీ వస్త్రాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేయుటకు ఈ పోటీలు దోహద పడతాయని తెలిపారు. ఖాదీ వస్త్రాలు మన సంప్రదాయ దుస్తులుగా గుర్తించినప్పుడు వాటిని ధరించడానికి అలవాటు పడతారని చెప్పారు. అంతేకాకుండా ఖాతీ వస్త్రాలు అనేక మంది జీవనోపాధికి తోడ్పడతాయన్నారు. నాటి ఖాదీ పంచా, చొక్కా, నేత చీరలు, అగ్గి పెట్టెలో పట్టే పట్టు వస్త్రాలు, మన దేశ చరిత్ర, సంస్కతి సాంప్రదాయాలకు నిలయాలని ఆయన తెలిపారు. ఈ పోటీలలో యర్రగొండపాలెంకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రాజేశ్వరి మొదటి బహుమతి, కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని అమత 2వ బహుమతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని సుమియ 3వ బహుమతి పొందినట్లు తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా ఉపాద్యాయులు రత్తయ్య, శ్రీకాంత్ వ్యవహరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.