
ప్రజాశక్తి - చాట్రాయి
పురుగుమందులు వేయకుండా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలని మండల తహశీల్దార్ సిహెచ్.విశ్వనాధరావు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సిబ్బంది కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. తహశీల్దార్ వీటిని పరిశీలించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువులు వేయకుండా ఎలాంటి కూరగాయలు పండించడం లేదన్నారు. ఆ కూరగాయల వలన ప్రజలు అనారోగ్య పాలవుతున్నారన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడని సేంద్రీయ ఎరువులు వాడుతూ పండించిన కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలని, ప్రజలందరూ వీటినే కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, సుజాత, వినీల, సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.