
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'ఆడుదాం.. ఆంధ్ర' కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. వార్డు సచివాలయం స్థాయిలో 'ఆడదాం ఆంధ్ర' కార్యక్రమం నిర్వహణపై మంగళవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో వార్డు అడ్మిన్, ఎడ్యుకేషన్, ఎమ్మెస్కే లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమం నిర్వహణకు సంబంధించి వార్డుస్థాయిలో ఆర్గనైజింగ్, టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆడదాం ఆంధ్ర నిర్వహణకు సంబంధించి వార్డు స్థాయిలో విస్తత ప్రచారం నిర్వహించడం, ఆసక్తి కలిగిన వారి పేర్లతో జాబితాలు సిద్దం చేయడం, క్రీడలకు అనువైన గుర్తించడం వంటి ఏర్పాటు చేయాలన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో-ఖో క్రీడల్లో నిర్వహణపై ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి ఆసక్తి కలిగిన 15 సంవత్సరాల పైబడిన వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించడం కోసం సచివాలయం పరిధిలో కార్యదర్శులు, వాలంటీర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంఈవో సెల్వరాజ్, సీఎంఎం గోపి, ఆర్వో గోపాలకష్ణ వర్మ, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.