
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అండర్-19 కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీల్లో మండలంలోని బర్రింకలపాడు గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపల్ శివ ప్రసాద్ తెలిపారు. తిరుపతిలో జరిగిన వాలీబాల్ క్రీడా విభాగంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టు తరపున కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కె.అరవింద్, యు.పవన్, కె.శ్రావణ్, ఎన్.సంతోష్లు పాల్గొనగా, ఫైనల్లో విశాఖ జిల్లాతో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడి ఓటమి చెంది రన్నర్గా నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా కబడ్డీ పోటీలలో పాల్గొన్న మడకం సాయితేజ ఉత్తమ ఆటతీరు కనబర్చి జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్(పిడి) వై.రత్నాకర్ తెలిపారు. అండర్-19 పోటీల్లో పలు విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకు చేరిన విద్యార్థులను మండల అధికారులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.