
నివాళులర్పిస్తున్న కాలం సుబ్బారావు
ప్రజాశక్తి-చీమకుర్తి : మండల పరిధిలోని ఆర్ఎల్పురం అంగన్వాడీ కేంద్రం కార్యకర్త మద్దుమాల కోటేశ్వరి(42) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. కోటేశ్వరి భౌతిక కాయాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ 24 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ అనారోగ్యంతో మద్దుమాల కోటేశ్వరి మృతి చెందడం బాధాకరమని తెలిపారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించి కోటేశ్వరి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.