Nov 08,2023 16:15

ప్రజాశక్తి - చింతలపూడి
   పర్యావరణాన్ని కాపాడుకుంటూ, కోర్టు ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్ధేశంతో గోద్రేజ్‌ ఆయిల్‌ పామ్‌ కంపెనీ సీతానగరం వారు 6 డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారని చింతలపూడి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సి.మధుబాబు తెలిపారు. అనంతరం గోద్రేజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ నాగప్రవిణ్‌ కూమర్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే ప్రధానమని గోద్రెజ్‌ ఆగ్రోవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కార్పొరేట్‌ సోషల్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం చింతలపూడి కోర్టు ఆవరణ, పరిసర ప్రాంతాలలో నూతన డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే సంస్థ సిఎస్‌ఆర్‌లో భాగంగా పలు రకాల సేవలను అందిస్తూ విద్యార్థులకు బస్సు పాసులు, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి వైద్య పరీక్షలు, మారుమూల పల్లెల్లో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉందని తెలిపారు. ఇదే క్రమంలో కోర్టు ఆవరణలో నూతన డస్ట్‌బిన్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్పక్రమంలో కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.