Nov 13,2023 22:17

ప్రజాశక్తి-సోమల: మండల కేంద్రంలో స్వయంభీశ్వరస్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి దాత విరాళాన్ని అందజేశారు. సోమలకు చెందిన రాగ్గారి గోపాలయ్య ధర్మపత్ని సుగునమ్మ జ్ఞాపకార్థం రూ.40500 విరాళాన్ని ఆలయ ధర్మకర్త సోమశేఖర్‌కు అందజేశారు. కార్యక్రమంలో లింగయ్య, శంకర, సోము, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.