Nov 03,2023 23:19

ప్రజాశక్తి-వెదురుకుప్పం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి అధికారులు స్థల పరీశీలన చేశారు. కళాశాల పక్కా భవనానికి నిధులు మంజూరైన నేపథ్యంలో అధికారులు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. విద్యాశాఖ ఈఈ శివప్రసాద్‌, డీఈ జయకుమార్‌ల బృందం స్థానిక కొమరగుంట వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటి సిఎం నారాయణస్వామి ఆదేశాలతో భవన నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా కళాశాలకు కేటాయించిన స్థలం అనువైనదేనని స్పష్టం చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ అన్నపూర్ణశారద, కమిటీసభ్యులు పేట ఢిల్లీ ప్రసాద్‌రెడ్డి, బండి సభాపతిరెడ్డి, వైసిపి నాయకులు ధనంజయులు రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.