Nov 05,2023 22:19

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను గద్దె దించాలని ఎఐటియుసి, సిఐటియు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు ఎస్‌టియూ కార్యాలయంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి టి.కోదండ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎఐటి యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్‌ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి జగన్మోహ న్‌రెడ్డి ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధా నాలను ఎండ కట్టారు. దేశంలో రాష్ట్రంలో రైతు లు కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నా పట్టిం చుకోకపోవడం దుర్మార్గమన్నారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ఆదాని, అంబానీలకు కట్టబెట్టి దేశాన్ని, ప్రజలను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడిగే ధైర్యం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి లేదన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం సమన్వయంగా ఐక్య పోరాటాలు చేస్తూ బిజెపి ప్రభుత్వాన్ని, వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు పోరాటం కొనసాగించాలని కార్మిక వర్గానికి, రైతాంగానికి, ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేయడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సపోర్ట్‌ చేస్తూ జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును కార్మిక వర్గం ఎండ గట్టాలన్నారు. నవంబర్‌ 27, 28 విజయవాడలో జరిగే కార్మిక, రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎఐటి యుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజ, సిఐటి యు నాయకులు చైతన్య, సురేంద్ర, సత్యమూర్తి, ఓబుల్‌రాజు, గోపినాథ్‌, మణి, నాగరాజు, విజయగౌరి, జయలక్ష్మి, ఎఐటియుసి, సిఐటియు, రైతు, మహిళ సంఘాల నాయకులు పాల్గొన్నారు.