
ప్రజాశక్తి-అమలాపురం
అమలాపురం జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులను అక్రమ తొలగింపు ఆపాలని బకాయి జీతాలు ఇవ్వలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి డిపిఒకి వినత పత్రం సమర్పించారు. ఐ.పోలవరం గ్రామపంచాయతీలో 8 మంది కార్మికులను ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తొలగించారు. ఎందుకు తొలగిస్తున్నా రో కార్మికులు చెప్పకుండా అక్రమంగా తొలగిస్తున్నారు. టి.కొత్తపల్లి గ్రామపంచాయతీలో మరో ఐదుగురిని తొలగించారు. జి.వేమవరం గ్రామ పంచాయతీలో 15 నెలలు బకాయి జీతాలు ఉన్నాయని అనేకసార్లు గ్రామపంచాయతీ కార్యదర్శిలు దృష్టి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంతో పంచాయతీ జిల్లా ఆఫీస్ వద్ద ధర్నా చేశామని సిఐటీయూ జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్ విలేకరులకు వివరించారు .గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతం ఇస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ అదికారులు ఎందుకు అని పని చేయించుకోలేక పోతున్నారు అన్నది పంచాయతీ అధికారులు సరిగా సమాధానం చెప్పడం లేదన్నారు.
కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు మంచి సర్వీస్ అందించిన పారిశుధ్యం కార్మికులను తొలగించడం బాధాకరం అన్నారు. వైసిపి అధికారంలో వచ్చిన దగ్గర నుండి గ్రామపంచాయతీ కార్మికులకు సరైన వేతనం అందడం లేదని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని, ఇఎస్ఐ, పిఎఫ అమలు చేయడం లేదని అన్నారు. పదేసి నెలలజీతాలు జీతం ఇవ్వకపోతే కార్మికులు కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరో పంచాయతీ పాలకులు, అధికా రులు చెప్పాలన్నారు. ఏ నెల జీతం ఆ నెల ఇచ్చేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ కార్మికులు ఆందరికీ ఇఎస్ఐ, ఫిఎఫ్, ఉద్యోగ భద్రత, సేఫ్టీ సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మ కాయల వెంకటేష్, జగడం నాగేశ్వరరావు, వడ్డీ సాక్షి, కాశి పళ్ళలమ్మ, నాగముని తదితరులు పాల్గొన్నారు.