
కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరపాలక సంస్థలో పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన అవుట్సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెక్కులను జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, మేయర్ ఎస్.అముద, కమిషనర్ డాక్టర్ జె.అరుణ పంపిణీ చేశారు. నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగం పరిధిలో అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తూ వి.రెడ్డప్ప పి.కోదండన్, టి.రామూర్తి, జి.మునెమ్మలు వివిధ కారణాలతో మరణించారు. వీరి కుటుంబాలకు అండగా నిలవడం కోసం నగరపాలక సంస్థ ద్వారా ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కులను బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీ, మేయర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ ఆర్.చంద్రశేఖర్, సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంఈ గోమతి, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్ పాల్గొన్నారు.