Nov 14,2023 22:52

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
చిత్తూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రితో ఎంఓయూ మేరకు అపోలో యాజమాన్యం రోగులకు అందిస్తున్న వైద్యచికిత్సలను పర్యవేక్షించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌, సీఈఓ ఆరోగ్యశ్రీ డాక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం చిత్తూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ బాబ్జీ, డిఎంఐ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) డాక్టర్‌ నరసింహన్‌లతో కలసి ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ పరిశీలించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిత్తూరు ప్రధాన ఆసుపత్రితో అపోలో యాజమాన్యం 2015-16 సంవత్సరంలో ఎంఓయూ కుదుర్చుకుని అపోలో హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ రీసర్చ్‌ సిబ్బందితో కలసి కార్యకలాపాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఏపి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ కష్ణ బాబు, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ సూచనల మేరకు ఏపివివిపి కమిషనర్‌, డాక్టర్‌ బాబ్జీ, డిఎంఐ డాక్టర్‌ నరసింహన్‌లతో కలసి త్రిసభ్య కమిటీగా ఎంఓయూలోని ప్రభుత్వ నిబంధనల మేరకు ఆసుపత్రి నిర్వహణ, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్న పనితీరుని పర్యవేక్షణకు రావడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఓపి, ఐపి విభాగం, ఎంసిహెచ్‌, క్యాజు వాలిటీ వార్డులను సందర్శించి రోగులకు వైద్యం అందిస్తున్న తీరు, మందుల పంపిణీ, వైద్య పరీక్షలు చేయడం తదితర అంశాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షల నిర్వహణ, పారిశుద్ధ్యం, మందుల పంపిణీ, వైద్యుల నియామకం, బడ్జెట్‌ కేటాయింపులో ఉన్న సమస్యలు, తదితర అంశాల సంక్షిప్త నివేదికను ఏపి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ దష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించడానికి కషి చేయడం జరుగుతుందన్నారు. వైద్య చికిత్స కొరకు చిత్తూరు ప్రభుత్వ జిల్లాఆసుపత్రికి వచ్చిన రోగులను ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళకుండా ఇక్కడే వైద్య చికిత్సలు అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు ప్రధానఆస్పత్రి తనిఖీల్లో భాగంగా కమిషనర్‌ మొదట ఆసుపత్రిలోని అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పేషెంట్లు వారి పొందుతున్న వైద్యసేవలు గురించి రోజువారి ఓపి, తదితర సంబంధిత అంశాలపై ఆరా తీశారు. పలువురు రోగులు డాక్టర్లు మందులు రాసి ఇక్కడ లేవు బయట తెచ్చుకోవాలంటున్నారని చెప్పారు. కొన్ని మందులు ఆస్పత్రిలో లేనిపక్షంలో బయట తెచ్చుకోమని రాసి ఇవ్వడం జరుగుతుందని సూపరింటెండెంట్‌ కమిషనర్‌కి వివరించారు. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ తనిఖీలో భాగంగా కమిషనర్‌ విచారించగా రోజుకి 180 నుండి 200 దాకా 800, 500 స్కానింగ్‌ చేయడం జరుగుతుందని డాక్టర్లు కమిషనర్‌కి తెలిపారు. అనంతరం ఆడియో మెట్రి గది, మైక్రో బయాలజీ క్లినికల్‌ పాథాలజీ తదితర విభాగాలను పరిశీలించి ఫుల్లీ ఆటోమేటిక్‌ అనలైజర మిషన్‌ పనితీరును డాక్టర్లు కమీషనర్‌కు వివరించగా ప్రభుత్వం నుండి అందిన మిషన్స్‌లో ఎటువంటి సమస్యలున్న తన దష్టికి తెస్తే దాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, అపోలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ నరేష్‌ కుమార్‌ రెడ్డి, అపోలో డీన్‌ డాక్టర్‌ ఆల్ఫ్రెడ్‌, మెడికల్‌ అడ్మినిస్ట్రేటర్‌ డాక్టర్‌ రామ్‌ గోపాల్‌లతో త్రిసభ్య కమిటీ సమావేశమై ఆసుపత్రిలోని సమస్యలపై చర్చించారు.
జీవో ప్రకారం జీతాల్విండి
వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌కు వినతి
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న శానిటేషన్‌, సెక్యూరిటీ, సూపర్వైజర్‌, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్‌ సిబ్బందికి ప్రభుత్వ జీఓ ప్రకారం వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆసుపత్రిలో20 సంవత్సరాలకు పైగా వివిధ కేటగిరీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ వెంకటేష్‌కి ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ కమిషనర్‌ స్పందిస్తూ సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని నాయకులకు హామీ ఇచ్చారు.