
ప్రజాశక్తి - ఆలమూరు : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రదాతగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిలుస్తారని ఏఎంసీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని మడికి శివారు మల్లావానితోట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జగనన్న వైద్య సురక్ష శిబిరం బుధవారం నిర్వహించారు. చొప్పెల్ల, పెదపల్ల పీహెచ్సీలకు చెందిన వైద్యులు సువర్చలాదేవి, పీ.భవానీ శంకర్, సిహెచ్సి వైద్యులు షమీ ఉన్నిష, కంటి వెలుగు వైద్యులు శ్రీలక్ష్మి, ఆర్థో వైద్యులు కేవీ రెడ్డి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేద ప్రజలకు క్రమం తప్పకుండా చెకప్లు చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా నాణ్యమైన మందులు, పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అన్ని రకాల వైద్యపరీక్షలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కార్పోరేట్ వైద్యం అందుతోందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత రోగులు విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందులు ఎంత ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ జానకి రాఘవ, ఎంపీహెచ్సిఓ జ్యోతి కుమార్, కార్యదర్శి కె.మోక్షాంజలి, ఎంపీటీసీ చెల్లబోయిన దుర్గాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, అంగన్వాడిలు కె.మేర్శీ ఫ్లోరెన్సీ, ఎం.బేబీ శ్రీదేవి, పి.సత్యవతి పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.