
జగన్న సురక్ష హెల్త్ కార్డులు పంపిణీ చేస్తున్న నరగ మేయర్ అముద
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ఇంటి వద్దకే వైద్యసేవలు అందుతున్నాయని నగర మేయర్ ఎస్.అముద చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం 47వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని మేయర్ ఎస్.అముద, డిప్యూటీ మేయర్ ఆర్.చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వైద్యసేవలు అందుతుందన్నారు. వైద్యశిబిరంలో ప్రభుత్వ వైద్యులతో పాటు కార్పొరేట్ వైద్యులు ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జగనన్న ఆరోగ్య వైద్యశిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా వైద్యశిబిరంలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. రోగులకు జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం డ్వాక్రా, ఐసీడీఎస్ స్టాల్స్ను సందర్శించారు. ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, వార్డు కార్యదర్శులు, వైద్యాధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.