Oct 28,2023 18:31

మాచవరం- 2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ, సర్పంచ్‌ లు

ప్రజాశక్తి - అంబాజీపేట
ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేలా స్పెషలిస్టుల వైద్య సేవలందించడం స్ఫూర్తిదాయకమని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. మాచవరం సచివాలయం-2 లో శనివారం సర్పంచ్‌ నాగాబత్తుల శాంతకుమారి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబాజీపేట మండల పరిధిలో-19 సచివాలయాలలో సురక్ష శిబిరాలను పంచాయతీ సర్పంచ్‌ లు, కార్యదర్శులు, పంచాయతీ ఉద్యోగులు, ఆరోగ్య సిబ్బంది, విజయవంతంగా నిర్వహించారని ఎంపిడిఒ కె. సత్యనారాయణమూర్తి అన్నారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను దీర్ఘకాలిక వ్యాధులు వారు సహకరించి సద్వినియోగం చేసుకున్నారని ఇఒపిఆర్‌డి తహశీల్దార్‌ మంగాతాయారు అన్నారు. ఆరోగ్య సురక్ష శిబిరాలను విజయవంతం చేసిన వైద్యులు, సహకరించిన ఉద్యోగులకు, అధికారులకు, పంచాయతీ పాలకవర్గం మరియు నాయకులకు ఇఒపిఆర్‌డి బి.మమత ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వి.గౌతమి, కెఎస్‌.శ్రీనివాస్‌, వైస్‌ ఎంపిపి ఎన్‌.నాగరాజు, సొసైటీ ఛైర్‌పర్సన్‌ దొమ్మేటి సత్యమోహన్‌, పికె.రావు, వాసంశెట్టి చినబాబు, ఎఎమ్‌సి ఛైర్‌పర్సన్‌ నాగవరపు నాగరాజు, ఎన్‌వి.సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి జిజికె.కుమార్‌, పిహెచ్‌సి సిహెచ్‌ఒ బి.అప్పారావు  ఉన్నారు.