ప్రజాశక్తి-రామచంద్రపురం కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన భారత సైనికుడు పిట్ట శ్రీనివాస్ (40) ఉగ్రదాడిలో మృతి చెందగా ఆయన భౌతిక కాయాన్ని సోమవారం గ్రామానికి తీసుకు వచ్చారు. భారత సైన్యంలో హవాల్దర్ గా పనిచేస్తూ పేకేరు భీమ్ నగర్కు చెందిన పిట్టా శ్రీనివాస్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో పూర్తి ప్రభుత్వ, అధికార లాంచనాలతో నిర్వహించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హవాల్దర్ శ్రీనివాస్ మృతదేహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం, ఆర్మీ, నేవీ అధికారులు, డిసిఎంఎస్ డైరెక్టర్ పేట్టా శ్రీనివాస్ రావు, సర్పంచులు చప్పిడి శ్రీనివాసరావు, వైసిపి నేతలు అధికారులు, పాల్గొన్నారు.










