మంజూరు పత్రాన్ని ఇస్తున్న పిఒ
ప్రజాశక్తి-పాడేరు: ఇంటి స్థలం మంజూరు కోసం ఐటిడిఏలో నిర్వహించిన స్పందనలో దివ్యాంగుడు వంటారి చంటిబాబు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఏ పి ఓ వి.అభిషేక్ అర్జీని స్వీకరించి నివాస స్థలం కేటాయించాలని పాడేరు తహశీల్దార్ని ఆదేశించారు. ఈ మేరకు తలారిసింగి గ్రామం లో ఒకటిన్నర సెంట్ల భూమికి కేటాయించి నివాస స్థలాన్ని గురువారం ఐటిడిఏ పిఓ అభిషేక్ ఆయన కార్యాలయంలో నివాశ స్థలం దృవీకరణ పత్రాన్ని అందజేసారు. ఐటిడిఏ నుండి రూ.20 వేల ఆర్దిక సహాయాన్ని మంజూరు చేసారు. ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు తహశీల్దార్ వంజంగి త్రినాధ రావు, ఆర్ ఐ నల్లన్న తదితరులు పాల్గొన్నారు.










