
ప్రజాశక్తి - చిత్తూరు
గ్రామాలలోని ఇళ్ళకు, ఇళ్ళ స్థలాలకు యాజమాన్య హక్కులను ఖరారు చేసేందుకు రూపొందించిన కార్డులను పంపిణి చేసే ఉద్దేశంతో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పధకం - స్వామిత్వ అను కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగినదని జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. అక్టోబర్ 11, 2020 న ప్రారంభించిన స్వామిత్వ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు ఖాళీ స్థలాలను డ్రోన్ ద్వారా సర్వే చేయించి ఆస్తి హక్కులను అందజేయడం జరుగుతుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ళు, ఖాళీ స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించి, యాజమాన్య ఆస్తి ధవపత్రం కార్డులు జారీ చేయబడునని, ఈ హక్కు పత్రాల ద్వారా ప్రజలు తమ ఆస్తులను పునర్నిర్మాణం చేసుకోవచ్చని, బ్యాంకుల్లో తనఖా ఉంచి రుణాలు పొందవచ్చని, క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని, తమ వారసులకు, బంధువులకు దాన విక్రయ సర్వాధికారాలు బదిలీ చేసుకోవచ్చు నని , జిల్లాలోని 822 గ్రామాలలో స్వామిత్వ సర్వే ప్రారంభించగా 35 గ్రామాలలో ప్రక్రియ పూర్తి కాగా, 17 గ్రామాలకు హక్కు పత్రాలు సిద్ధంగా ఉన్నాయని, గ్రామ పంచాయతీలలో జరుగుతున్నస్వామిత్వ సర్వే కొరకు గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసులు జారీ చేసిన సమయము నందు సంబంధిత యజమానులు అందుబాటులో ఉండి, వారి ఆస్తులకు సంబంధించిన దవీకరణ పత్రాల నకళ్లను అందజేసి సర్వే బందానికి సహాకరించాలని జిల్లా పంచాయతీ అధికారి తెలియ జేశారు.